Encounter: ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్... 11 మంది నక్సల్స్ మృతి

11 Maoists killed in encounter takes place at Chhattisgarh and Telangana border
  • మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ
  • బీజాపూర్ జిల్లాలో కాల్పుల మోత
  • నేటి ఉదయం 9 గంటల నుంచి ఎదురుకాల్పులు
ఇటీవల కాలంలో ఛత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్లతో నక్సల్స్ కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల ఘటనలో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. 

బీజాపూర్ జిల్లా బారేడుబాక అటవీ ప్రాంతం వద్ద భద్రతా దళాలకు, నక్సల్స్ కు మధ్య కాల్పులు జరిగాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపడుతున్న సంయుక్త భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ ఉదయం 9 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఘటన స్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Encounter
Maoists
Chhattisgarh
Telangana

More Telugu News