ప్యాకెట్ పాలను మరగబెట్టాకే తాగాలా.. నిపుణులు ఏమంటున్నారంటే?
- పచ్చి పాలను తాగొద్దని నిపుణుల సూచన
- ప్యాకెట్ పాలను ఆల్రెడీ వేడి చేస్తారని వివరణ
- నేరుగా తాగినా ఇబ్బంది ఉండదంటున్న డాక్టర్
తెల్లవారుజామున ఇంటిముందుకు వచ్చే, ఇంటి పక్కనే ఉండే కిరాణా షాపులలో దొరికే పాల ప్యాకెట్ విషయంలో చాలా పెద్ద ప్రాసెస్ ఉందన్నారు. ముందుగా పాడి రైతుల నుంచి సేకరించిన పాలను ఆయా కంపెనీలు వివిధ పద్ధతులలో ప్రాసెస్ చేసి ప్యాకెట్ల రూపంలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తారని గుర్తుచేశారు. పాలను మాయిశ్చరైజ్ చేయడం కూడా ఈ ప్రాసెస్ లో ఓ భాగమని చెప్పారు. పాడి రైతుల నుంచి సేకరించిన పాలను కంపెనీలు వేడి చేసి చల్లార్చి, ఇతరత్రా ప్రాసెస్ పూర్తిచేశాకే ప్యాకెట్ ను తయారుచేస్తాయని వివరించారు. ప్యాకెట్ లోకి చేరకముందే పాలను వేడి చేస్తారు కాబట్టి మళ్లీ వేడి చేయాల్సిన అవసరంలేదని తెలిపారు. ప్యాకెట్ పాలను అవసరమైతే నేరుగా తాగొచ్చని డాక్టర్ రాకేశ్ గుప్తా వివరించారు.