మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం.. చీపురు పట్టిన సీఎం చంద్రబాబు
అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం గాంధీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. బాపూజీ స్ఫూర్తితోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకురావడం జరిగిందన్నారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే.. మనం ఆరోగ్యంగా ఉంటామని చంద్రబాబు తెలిపారు.