విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం

Stones Thrown At Vande Bharat Windows Broken
చత్తీస్‌గఢ్‌లో వందేభారత్ రైలు ట్రయల్ రన్ జరుగుతుండగా రాళ్లు విసిరిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ - ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం మధ్య నడవనున్న ఈ రైలు శుక్రవారం ఉదయం విశాఖపట్టణం నుంచి వస్తుండగా బగ్‌బహరా రైల్వే స్టేషన్ వద్ద నిందితులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ రైలుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కానప్పటికీ సీ2-10,  సీ4-1, సీ9-78 కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. నిందితులు శివకుమార్ బఘేల్, దేవేంద్ర కుమార్, జీతు పాండే, సన్వానీ, అరుణ్ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ రైలుతోపాటు దేశంలోని తొలి వందేభారత్ మెట్రో రైలును కూడా మోదీ ప్రారంభించనున్నారు. ఇది గుజరాత్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్‌ మధ్య నడవనుంది. అలాగే, 20 కోచ్‌లతో వారణాసి-ఢిల్లీ మధ్య పరుగులు పెట్టనున్న తొలి 20 కోచ్‌ల వందేభారత్ రైలును కూడా మోదీ నేడు ప్రారంభిస్తారు. అలాగే, టాటానగర్-పాట్నా, నాగ్‌పూర్-సికింద్రాబాద్, కొల్హాపూర్-పూణె, ఆగ్రా కంటోన్మెంట్-బెనారస్, పూణె-హుబ్బళ్లి మధ్య నడిచే వందేభారత్ రైళ్లను మోదీ ప్రారంభిస్తారు.
Go Back to Shorts
Vande Bharat Rail
Chhattisgarh
Durg
Visakhapatnam
Stone Attack

More Telugu News