కంగనా రనౌత్పై పంజాబ్ మాజీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు... మహిళా కమిషన్ ఆగ్రహం
- రైతుల నిరసన వెనుక విదేశీ కుట్ర ఉందన్న కంగనా రనౌత్
- కంగనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మాజీ ఎంపీ
- మహిళను అవమానించినందుకు చర్యలు తీసుకుంటామన్న మహిళా కమిషన్
ఈ క్రమంలో ఆమెపై పంజాబ్ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం ఎలా జరుగుతుందో మీరు ఆమెను (కంగన) అడగాలని, అప్పుడు ప్రజలకూ వివరించవచ్చునని, అత్యాచార విషయాల్లో ఆమెకు చాలా అనుభవం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆయన వ్యాఖ్యలను పంజాబ్ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. మహిళను అవమానించారని, ఇందుకు తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మాజీ ఎంపీ వ్యాఖ్యలపై కంగన బృందం స్పందిస్తూ... అత్యాచారాలను చిన్న చూపు చూడటం సర్వ సాధారణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది.