నూతన దంపతులు అనంత్ అంబానీ-రాధికాలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆశీర్వాదం.. వీడియో ఇదిగో
- శనివారం రాత్రి జరిగిన ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుకకు హాజరైన మోదీ
- ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
- ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు
జియో వరల్డ్ సెంటర్లో ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినోతో పాటు అనేక మంది అంతర్జాతీయ ప్రముఖులు విచ్చేశారు. కాగా జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక జరిగింది. ఇవాళ (ఆదివారం) గ్రాండ్ రిసెప్షన్తో పెళ్లి వేడుకలు ముగుస్తాయి.