IAS: ఏపీలో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారుల బదిలీలు

Two more IAS officers transferred in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక, ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు.  తాజాగా మరికొందరు ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. 

విశాఖ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ వర్మను ఏపీ టౌన్ షిప్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న సీహెచ్. శ్రీధర్ ను విశాఖ మున్సిపల్ కమిషనర్ గా నియమించారు. 

ఇక, జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (అర్బన్) స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న బి.సుబ్బారావును బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ గానూ, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గానూ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Go Back to Shorts
IAS
Transfer
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News