రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌

CM Revanth Reddy Review Meeting on State symbol
  • జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో స‌మీక్ష నిర్వ‌హించిన‌ ముఖ్య‌మంత్రి 
  • స‌మీక్ష‌లో పాల్గొన్న క‌ళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూప‌ల్లి, కోదండ‌రాం
  • ప్ర‌జ‌ల పోరాటం, త్యాగాలు ప్ర‌తిబింబించేలా రాష్ట్ర చిహ్నం
తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిహ్నం తుదిరూపుపై క‌ళాకారుడు రుద్ర రాజేశంతో చ‌ర్చించారు. ప్ర‌జ‌ల పోరాటం, త్యాగాలు ప్ర‌తిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనున్న‌ట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీన అధికారిక చిహ్నంను రేవంత్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ స‌మీక్ష స‌మావేశంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం, అద్దంకి ద‌యాక‌ర్, జేఏసీ నేత ర‌ఘు, సీఎం స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.
Advertisement
Telangana
Revanth Reddy
State symbol

More Telugu News