'డ్రాగన్' గ్లింప్స్తో ఎన్టీఆర్ సంచలనం.. యూట్యూబ్లో ఆల్ టైమ్ రికార్డ్!
- యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్న 'డ్రాగన్' గ్లింప్స్
- 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్తో ఇండియాలో సరికొత్త రికార్డు
- ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ప్రిల్యూడ్
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్క్ యాక్షన్ డ్రామా
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న 'డ్రాగన్' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు సందర్భంగా మే 20న విడుదల చేసిన 'డ్రాగన్' ప్రిల్యూడ్ గ్లింప్స్ యూట్యూబ్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన తొలి 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, భారత సినీ చరిత్రలో ఒకే యూట్యూబ్ ఛానెల్లో అత్యధిక వ్యూస్ పొందిన గ్లింప్స్గా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.
4 నిమిషాల 28 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. 1967 నాటి ప్రపంచ నల్లమందు వ్యాపార సామ్రాజ్యం నేపథ్యంలో కథ సాగుతుందని ఈ వీడియో ద్వారా స్పష్టం చేశారు. 'లూగర్' అనే క్రూరమైన పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. మరోవైపు నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్గా అనిల్ కపూర్ నటించడంతో ఇద్దరి మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది.
ఈ సినిమా తాను తీసిన చిత్రాల్లోకెల్లా అత్యంత దేశభక్తి కలిగిన చిత్రమని, ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా డార్క్గా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. కేజీఎఫ్, సలార్ తరహాలోనే ఇందులో కూడా యాక్షన్ ఓ రేంజ్లో ఉండబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్టులో రుక్మిణీ వసంత్, బిజు మీనన్, గురు సోమసుందరం, అశుతోష్ రాణా తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
4 నిమిషాల 28 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. 1967 నాటి ప్రపంచ నల్లమందు వ్యాపార సామ్రాజ్యం నేపథ్యంలో కథ సాగుతుందని ఈ వీడియో ద్వారా స్పష్టం చేశారు. 'లూగర్' అనే క్రూరమైన పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. మరోవైపు నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్గా అనిల్ కపూర్ నటించడంతో ఇద్దరి మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది.
ఈ సినిమా తాను తీసిన చిత్రాల్లోకెల్లా అత్యంత దేశభక్తి కలిగిన చిత్రమని, ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా డార్క్గా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. కేజీఎఫ్, సలార్ తరహాలోనే ఇందులో కూడా యాక్షన్ ఓ రేంజ్లో ఉండబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్టులో రుక్మిణీ వసంత్, బిజు మీనన్, గురు సోమసుందరం, అశుతోష్ రాణా తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.