లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం మోదీ అధ్యక్షతన సమావేశం
- మోదీ అధ్యక్షతన గురువారం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం
- లోక్సభ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు
- ఈసీ నోటిఫికేషన్కు ముందే లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు అవకాశం
- తొలి విడతలో యూపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
ఏప్రిల్ - మే నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలిజాబితాను ఈసీ నోటిఫికేషన్ కు ముందే విడుదల చేయాలని పార్టీ యోచిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, యూపీలో బీజేపీ కాస్తంత బలహీనంగా ఉన్న స్థానాలకు తొలుత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయమై చర్చించేందుకు బీజేపీ కీలక నేతలు అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా గతవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో సమావేశమయ్యారు. యూపీలో పార్టీకి గట్టి పోటీ ఎదురయ్యే స్థానాలపై చర్చలు జరిపారు.