సందడిగా మొదలైన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు
- గుజరాత్లో శుక్రవారం జరిగిన ‘లగన్ లఖ్వాను’ వేడుక
- తొలి వివాహ ఆహ్వాన పత్రిక తయారీ
- ప్రత్యేకంగా రూపొందించిన లెహంగాలో మెరిసిపోయిన కాబోయే వధువు రాధిక మర్చంట్
లగన్ లఖ్వాను వేడుకలో కాబోయే వధువు రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయక లెహంగాను ధరించింది. లెహంగాపై పూల డిజైన్లు ఆకట్టుకున్నాయి. ఇక ఆమె ధరించిన మూడు వరుసల డైమండ్ నెక్లెస్ సెట్ హైలైట్గా నిలిచింది. పాపిడి బిళ్లతో పాటు ఒక చేతికి కంకణం కనిపించింది. రాధిక మర్చంట్ ఫొటోలను మేకప్, హెయిర్స్టైల్ ఆర్టిస్ట్ లవ్లీన్ రామ్చందానీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. కాగా అనంత్ అంబానీ ప్రస్తుతం జియో ప్లాట్ఫామ్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక రాధిక మర్చంట్ 1994లో పుట్టింది. ఆమె తండ్రి విరేన్ మర్చంట్ ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ సంస్థ ఎన్కోర్ హెల్త్కేర్కి సీఈవోగా వ్యవహరిస్తున్నారు.