ప్రధాని మోదీ మెచ్చుకున్న రామ భక్తి గీతం.. వీడియో ఇదిగో!
- గుజరాతీ ఫోక్ సింగర్ గీతా రబారీ పాటను ట్విట్టర్ లో పంచుకున్న ప్రధాని
- పాట వింటుంటే భావోద్వేగంగా ఉందని వెల్లడి
- రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశమంతా ఎదురుచూస్తోందని వ్యాఖ్య
గుజరాత్ కు చెందిన గీతా రబారీ జానపద గాయని. అయోధ్య రాముడిపై తాజాగా ఓ భక్తి గీతాన్ని రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘మేరా రామ్ ప్రభూ జీ ఘర్ ఆయే..’ అంటూ సాగే ఈ పాటను విన్న ప్రధాని.. గీతా రబారీని మెచ్చుకున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ రాముడికి స్వాగతం పలుకుతూ సాగిన గీతం భావోద్వేగం కలిగించిందని మోదీ ట్వీట్ చేశారు.