Road Accident: తెలతెలవారుతుండగా రోడ్డు ప్రమాదం.. టీ తాగేందుకు వెళ్లి ముగ్గురు యువకుల దుర్మరణం

Three men dead in road accident in Prakasam district
  • ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలో ఘటన
  • యువకులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టిన బొలేరో వాహనం
  • పాపాయిపల్లిలో విషాదం
తెలతెలవారుతుండగానే ప్రకాశం జిల్లాలో తీరని విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. బెస్తవారిపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద ఈ తెల్లవారుజామున జరిగిందీ ఘటన. 

పాపాయిపల్లికి చెందిన పవన్ (20), శ్రీనివాస్ (21), రాహుల్ (21) స్నేహితులు. టీ తాగేందుకు బైక్‌పై పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు బయల్దేరారు. ఈ క్రమంలో ఎదురుగా గిద్దలూరు నుంచి బెస్తవారిపేట వైపు వస్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి వేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో యువకులు ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసి పాపాయిపల్లిలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident
Prakasam District
Papaipalli
Andhra Pradesh

More Telugu News