నారా లోకేశ్ చెపుతున్న రెడ్ బుక్ పై ఏపీ డీజీపీ ఏమన్నారంటే..!
- ఎవరు ఎవరికైనా రెడ్ బుక్ ఇవ్వొచ్చన్న ఏపీ డీజీపీ
- రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడి
- మహిళలపై నేరాలకు పాల్పడుతున్న వారు కూడా భయపడుతున్నారని వ్యాఖ్య
మూడేళ్లలో 5 లక్షల కిలోల గంజాయిని ధ్వంసం చేశామని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో 4,900 మంది రౌడీలు ఉన్నారని చెప్పారు. వీరిలో వెయ్యి మందికి కోర్టులు శిక్షలు విధించాయని... మిగిలిన వారిపై నిరంతరం నిఘా ఉంచామని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారు కూడా దాదాపుగా దారిలోకి వచ్చారని చెప్పారు. 55 మంది వారి అకౌంట్లను కూడా మూసేసుకున్నారని తెలిపారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ చెపుతున్న రెడ్ బుక్ పై స్పందిస్తూ... ఎవరు ఎవరికైనా రెడ్ బుక్ ఇవ్వొచ్చని చెప్పారు. అక్రమ కేసులు నమోదు చేస్తూ, టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాస్తున్నానని లోకేశ్ చెపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ల సంగతి తేలుస్తామని ఆయన బహిరంగంగా హెచ్చరిస్తున్నారు.