Cricket: శ్రీలంక మీద ఓడిన ఇంగ్లండ్‌కు భారీ షాక్.. పాయింట్ల పట్టికలో సమీకరణం ఇదీ

Massive Blow For Defending Champions Englands Semi final Hopes
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రస్తుత వరల్డ్ కప్‌లో చెత్త ఆటను కొనసాగిస్తోంది. వరుస ఓటముల పరంపర నుంచి తప్పించుకోలేకపోతోంది. తాజాగా నాలుగవ ఓటమిని కూడా మూటగట్టుకోవడంతో ఆ జట్టు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. గురువారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ చివరి నుంచి రెండో స్థానానికి దిగజారింది. ప్రస్తుతం రెండంటే 2 పాయింట్లు మాత్రమే ఈ జట్టు ఖాతాలో ఉన్నాయి. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా ఒక విజయమే సాధించింది. ఆ జట్టు రన్‌రేట్ -1.634గా ఉంది. దీంతో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు దాదాపు ముగిసిపోయినట్టేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు

ఇంగ్లండ్ తన తదుపరి మ్యాచ్‌లను భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్‌లతో ఆడనుంది. ఆతిథ్య భారత్‌, ఐదుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియాలు మంచి ఫామ్‌లో ఉన్నాయి. దీంతో ఈ జట్లపై గెలుపు ఇంగ్లిష్ జట్టుకు అంత సులభంగా ఉండకపోవచ్చు. దీంతో ఆ జట్టు సెమీఫైనల్ అవకాశాలు దాదాపు గల్లంతు అయినట్టేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలావుండగా ఇంగ్లండ్‌పై గెలుపుతో శ్రీలంక పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి ఎగబాకింది. 5 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలతో 4 పాయింట్లతో ఉంది. ఇక భారత్(10 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు), న్యూజిలాండ్ (8 పాయింట్లు), ఆస్ట్రేలియా (6 పాయింట్లు) వరుస 4 స్థానాల్లో ఉన్నాయి.
Cricket

More Telugu News