ఒకే దెబ్బతో సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకున్న టీమిండియా
- ఆసియా క్రీడల క్రికెట్ క్వార్టర్ ఫైనల్లో నేపాల్ ను ఓడించిన భారత్
- యశస్వి శతకం, సత్తా చాటిన బౌలర్లు
- ఇప్పటికే స్వర్ణం గెలిచిన భారత మహిళల జట్టు
రింకూ సింగ్ (15 బంతుల్లో 37 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (25), శివం దూబె (25 నాటౌట్) కూడా రాణించారు. నేపాల్ బౌలర్లు దీపేంద్ర రెండు, సందీప్, సోంపాల్ చెరో వికెట్ తీశారు. భారీ లక్ష్య ఛేదనలో నేపాల్ జట్టు ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసి ఓడింది. దీపేంద్ర సింగ్ 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(3/24), ఆవేష్ ఖాన్(3/32) చెలరేగారు. కాగా, ఈ క్రీడల్లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం గెలిచింది.