రిటైర్మెంట్పై యూ టర్న్ తీసుకున్న బెంగాల్ క్రీడా శాఖ మంత్రి
- వారం కిందట అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగిన మనోజ్ తివారి
- మరో ఏడాది ఆడాలని తాజాగా నిర్ణయం
- బెంగాల్కు రంజీ ట్రోఫీ అందించేందుకు చివరి ప్రయత్నం చేస్తానని వెల్లడి
ఇది వరకు రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన బెంగాల్ గత మూడు సీజన్లలో రెండుసార్లు రంజీ ఫైనల్కు చేరుకుంది. కానీ, మూడో ట్రోఫీ మాత్రం నెగ్గలేకపోయింది. ‘బెంగాల్ క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది. ఆటగాడిగా లేదా కెప్టెన్గా రంజీ ట్రోఫీ నెగ్గేందుకు మరోసారి ప్రయత్నించాలని అనుకుంటున్నా. అందుకే రిటైర్మెంట్ నుంచి వెనక్కి వస్తున్నా. వచ్చే సంవత్సరం ఇకపై యూ-టర్న్ ఉండదు. బెంగాల్ క్రికెట్కు మరో ఏడాది సమయం ఇవ్వాలనుకుంటున్నాను’ అని 37 ఏళ్ల తివారీ చెప్పారు.