- ఉదయం పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ ముద్రగడ లేఖ
- జగన్ ను ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ముద్రగడకు బుద్దా లేఖ
- కాపు ఉద్యమం పేరుతో చంద్రబాబును విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
ఏపీ రాజకీయాలు ఈరోజు కాపు నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ ముద్రగడ రాసిన లేఖ ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచింది. ముద్రగడకు అనుకూలంగా వైసీపీ, పవన్ కు మద్దతుగా టీడీపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ క్రమంలో, ముద్రగడ పద్మనాభంకు టీడీపీ నేత బుద్దా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. లేఖలో ముద్రగడపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. లేఖలో కొన్ని సూటి ప్రశ్నలు వేశారు.
ముద్రగడకు బుద్దా రాసిన బహిరంగ లేఖ ఇదే: