Nara Lokesh: ఎన్టీఆర్ కు హిస్టరీ ఉంది... చంద్రబాబుకు కాలిబర్ ఉంది: లోకేశ్

  • రాజమండ్రిలో టీడీపీ మహానాడు
  • ఈ సాయంత్రం భారీ బహిరంగ సభ
  • వాడీవేడిగా నారా లోకేశ్ ప్రసంగం
Lopkesh speech in TDP Meeting

రాజమండ్రి మహానాడులో ఏర్పాటు చేసిన టీడీపీ భారీ బహిరంగ సభలో పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగించారు. రాజమహేంద్రవరం (రాజమండ్రి) పేరులోనే రాజసం ఉందని, గోదావరి నీరులాగే ఇక్కడి వారి మనసులు కూడా స్వచ్ఛంగా ఉంటాయని వెల్లడించారు. గోదారొళ్ల యటకారం, మమకారం రెండూ సూపర్ అని అన్నారు. 

తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మూడక్షరాల పేరు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రాముడు అయినా, కృష్ణుడు అయినా, రావణుడు అయినా... అది ఎన్టీఆర్ అని కొనియాడారు. ఢిల్లీకి తెలుగోడి పవర్ ను చూపించింది ఎన్టీఆర్ అని కీర్తించారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయ ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించింది ఎన్టీఆర్ అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెట్టింది చంద్రన్న అని స్పష్టం చేశారు.

లోకేశ్ ప్రసంగం హైలైట్స్...

  • తెలుగుదేశం పార్టీ కుటుంబ పండగ మహానాడు కి వచ్చిన పసుపు సైన్యానికి, పార్టీ పెద్దలకు సలాం.
  • తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం, పసుపు జెండా చూస్తే పూనకం.
  • తెలుగుదేశం పార్టీ కంచుకోటకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

  • కష్టం వస్తే ప్రజల కన్నీరు తుడిచింది ఎన్టీఆర్.
  • రూ.2 కే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మధ్యాహ్న భోజన పధకం ఇలా సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసింది ఎన్టీఆర్.
  • మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి అన్నగారు అయ్యారు ఎన్టీఆర్.
  • పార్టీ పెట్టడానికి హిస్టరీ ఉండాలి. పార్టీ నడపడానికి క్యాలిబర్ ఉండాలి.
  • తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారికి హిస్టరీ ఉంది. పార్టీని నడుపుతున్న బాబు గారికి క్యాలిబర్ ఉంది.

  • హైటెక్ సిటీతో చరిత్ర సృష్టించింది చంద్రన్న, కియా, హెచ్‌సీఎల్‌, ఫ్యాక్స్ కాన్, టిసిఎల్ లాంటి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధికి అర్ధం చెప్పారు చంద్రన్న.
  • చంద్రన్న పండుగ కానుకలు, పెళ్లి కానుక, రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ లాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది, అన్న క్యాంటిన్ తో పేదవాడికి అన్నం పెట్టింది మన చంద్రన్న. 
  • తెలుగుదేశం పార్టీ, మన అధినేతల రికార్డులు కొట్టే మగాడు పుట్టలేదు, పుట్టడు.
  • టీడీపీ అంటే తెలుగు వారు గర్వంతో మీసం మెలేసే పార్టీ... వైసీపీ అంటే తెలుగు వారు తలదించుకునే పార్టీ. చంద్రన్న నిలబెడితే... జగన్ పడగొడతాడు. చంద్రన్న హీరో... జగన్ జీరో.

  • ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ జగన్ సాఫ్ట్ గా నటించాడు. సీఎం అయిన తరువాత సైకోగా మారిపోయాడు. అందుకే స్వీట్ గా సైకో జగన్ అని పేరు పెట్టా.
  • నాలుగేళ్ళలో మనం పీకింది ఏంటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని నాలుగేళ్ల తరువాత అపాయింట్మెంట్ ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కలిసినప్పుడు సైకో జగన్ ని అడిగితే ఎం చెప్పాడో తెలుసా? ప్రజా వేదిక పీకా, పేదల ఇళ్లు పీకా, టీడీపీ నాయకుల ఇళ్లు పీకా, ఓవర్ ఆల్ గా రాష్ట్రాన్ని పీక్కుతిన్నానని అని చెప్పాడట!
  • ఒక్క ఛాన్స్ ఇచ్చి 151 సీట్లు ఇస్తే సైకో జగన్ దేశంలోనే ధనిక సీఎం అయ్యాడు. పైగా పేదవాడ్ని అంటూ బీద అరుపులు అరుస్తున్నాడు.

  • లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా?
  • బెంగుళూరులో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడా?
  • సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టీవీ ఛానల్ ఉన్నవాడు పేదవాడా?
  • సైకో జగన్ చిన్నప్పుడు చాక్లెట్ దొంగ... పెద్దయినా బుద్ధి మారలేదు. ఇప్పుడు బడా చోర్ గా మారాడు.

  • సైకో జగన్ కి పరిపాలన చేత కాదు.. కానీ అతనో మంచి పెయింటర్. పేదలకు ఇళ్లు కట్టలేని జగన్ మన చంద్రన్న కట్టిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేస్తున్నాడు.
  • టీడీపీ పక్కా ఇళ్ల పాలసీ... వైసీపీది గుడిసెల పాలసీ.
  • మన చంద్రన్న అద్భుతమైన టిడ్కో ఇళ్లు కట్టారు. ఇంకో ముప్పై ఏళ్లు అయినా ఆ ఇళ్లు చెక్కు చెదరవు. 
  • సైకో జగన్ సెంటు స్థలాలు ఇచ్చి చేతులు ఎత్తేశాడు.

  • సెంటు స్థలాల స్కీం పెద్ద స్కాం. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్మి 7 వేల కోట్లు కొట్టేసారు వైసీపీ నేతలు.
  • పేదవాళ్లు శాశ్వతంగా అప్పుల్లో కూరుకుపోవడమే ఈ సెంటు స్థలాల స్కీమ్. ఎన్నికల ముందు ఇళ్లు నేనే కడతా అన్న సైకో జగన్ ఇప్పుడు అప్పు చేసి ఇళ్లు కట్టండి లేకపోతే స్థలం వెనక్కి ఇవ్వండి అని బెదిరిస్తున్నాడు.
  • ఒక పేదవాడు రెండు రూపాయల వడ్డీకి 10 లక్షలు అప్పు తెచ్చి ఇళ్లు కట్టగలడా? కడితే ఆ అప్పు తీర్చగలడా? ఆ పేద కుటుంబం జీవితం మొత్తం కష్టపడినా అప్పు తీరదు. వాళ్లు శాశ్వతంగా అప్పుల్లో కూరుకుపోతారు.
  • ఈ స్కాం లో ఇంకో ట్విస్ట్ గురించి చెప్పనా? ఇళ్లు కట్టుకునే స్థోమత లేని వారి పట్టాలు వైసీపీ నేతలు కొట్టేస్తున్నారు.

  • ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల తరపున పోరాడాలి అని నేను యువగళం పాదయాత్ర మొదలు పెట్టాను.
  • నాకు 40 ఏళ్ళు. ఈ నలభై ఏళ్ళు ఒక ఎత్తు...నేను పాదయాత్ర చేసిన 110 రోజులు ఒక ఎత్తు.
  • 110 రోజుల యువగళం పాదయాత్ర లో ప్రజల కష్టాలు కళ్లారా చూశాను.
  •  సైకో జగన్ విధ్వంస పాలనతో రాష్ట్రం సర్వనాశనం అయ్యింది.
  • చంద్రన్న పాలనలో జరిగిన అభివృద్ధి చూశాను. జగన్ పాలనలో జరిగిన డ్యామేజ్ చూశాను.

  • పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల మనిషిగా ఎలా ఉండాలో అర్థమైంది.
  • యువత, మహిళలు, రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎదుర్కుంటున్న సమస్యలు పాదయాత్రలో తెలుసుకున్నాను.
  •  అధినేత, పార్టీ పెద్దల దృష్టికి సమస్యలు తీసుకొచ్చాను. దానిలో భాగంగానే వారికి మేలు చేసే విధంగా కొన్ని హామీలు ఈ రోజు చంద్రన్న ఇస్తున్నారు.
  • యువగళం పాదయాత్ర అడ్డుకోవడానికి సైకో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించాడు. నేను అంబేద్కర్ గారి రాజ్యాంగంతో సమాధానం చెప్పాను. 

  • నేను ముందే చెప్పాను సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అని.
  • పెద్దిరెడ్డి నుండి పెద్దారెడ్డి వరకూ నన్ను అడ్డుకుంటాం అని ఛాలెంజ్ చేశారు.
  • అందరికి ఒకటే సమాధానం... ఫ్లూటు జింక ముందు ఊదు... సింహం ముందు కాదు. ఎవడు వస్తాడో రండి... తగ్గేదేలే... అంటే అంతా పారిపోయారు.

  • విద్య, వైద్యం, ఆర్థిక సహాయం... దేశంలో కార్యకర్తల సంక్షేమం కోసం రూ.150 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
  • కార్యకర్తకు కష్టం వస్తే మీ లోకేశ్ ఆగడు... కార్యకర్త ఇబ్బందుల్లో ఉంటే సైకో జగన్ స్పందించడు.
  • నా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని వదిలి పెట్టను. అమలాపురంలో ఉన్నా అమెరికాలో ఉన్నా పట్టుకొచ్చి లోపలేస్తా.
  • పోరాటం మన పసుపు సైన్యం బ్లడ్ లో ఉంది. పోరాడిన ప్రతి కార్యకర్త బాధ్యత నాది.
  • పెద్ద పెద్ద సైకోలనే ఫుట్ బాల్ ఆడిన పార్టీ టీడీపీ. పిల్ల సైకో ఒక లెక్కా?

  • పేదలు ఎప్పటికీ పేదరికంలో ఉండాలి అనేది సైకో జగన్ కోరిక. పేదరికం లేని రాష్ట్రం చూడాలి అన్నది మీ లోకేశ్ సింగిల్ పాయింట్ ఎజెండా.
  • రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఉరి తీసి భూమిలో పాతేద్దాం. సైకోని ప్యాలస్ లో పెట్టి పర్మినెంట్ గా తాళం వేద్దాం. సైకో పోవాలి... సైకిల్ రావాలి.
  • చివరిగా ఒక మాట చెబుతాను వందేళ్లు కాదు వెయ్యేళ్లు అయినా ట్రూ లెజెండ్ ఎన్టీఆర్... ఎన్టీఆర్ లివ్స్ ఆన్... అంటూ తన ప్రసంగం చేశారు.

ఇక చివరగా, కార్యకర్తలను ఉద్దేశించి... జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లాలని, క్షేమంగా ఉండాలని లోకేశ్ ఆకాంక్షించారు.

More Telugu News