Delhi: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు

  • హాఫ్ సెంచరీకి సమీపంలో వార్నర్, పృథ్వీషా
  • పవర్ ప్లే ముగిసేసరికి 61 పరుగులు చేసిన ఢిల్లీ జట్టు
  • వికెట్లేమీ కోల్పోకుండానే దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ
David Warner and Prithvi Shaw Near Fifties As DC Fly vs PBKS

ఐపీఎల్ 16లో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తోంది. ఈ సీజన్ లో మరో ఏడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోర్ వికెట్లు ఏమీ కోల్పోకుండా 61 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్లేమీ కోల్పోకుండా 76 పరుగులు చేసింది. వార్నర్ 41, పృథ్వీషా 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. పంజాబ్ ఆరు గెలిచి, ఆరు ఓడిపోయింది.

More Telugu News