naresh: ఆ నిర్వచనం ప్రకారం పవిత్రతో నా పెళ్లయిపోయినట్లే: నరేశ్

  • తాము పెళ్లి చేసుకున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడి
  • నరేశ్, పవిత్ర జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ 
  • ఈ నెల 26న విడుదల కానున్న సినిమా
Naresh Opens Up About Marriage Rumors With Pavitra

తాను పవిత్రా లోకేశ్ ను పెళ్లి చేసుకున్నానని చాలా మంది అనుకుంటున్నారని, అందులో నిజం లేదని సీనియర్ నటుడు నరేశ్ చెప్పారు. తన దృష్టిలో పెళ్లంటే రెండు హృదయాల సంగమం అని అన్నారు. ఆ నిర్వచనం ప్రకారం తమ ఇద్దరి పెళ్లయిపోయినట్లేనని అభిప్రాయపడ్డారు. ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో నరేశ్, పవిత్ర హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. విజయకృష్ణ మూవీస్‌ పతాకంపై నరేశ్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలైంది. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన నరేశ్.. పవిత్రతో తన పెళ్లి వార్తలపై స్పందించారు. తనకు వివాహ వ్యవస్థపై గొప్ప నమ్మకం ఉందన్నారు. పెళ్లి గొప్పతనాన్ని ఈ సినిమాలో తెలియజెప్పామని, కథానుగుణంగా చక్కటి టైటిల్‌ కుదిరిందని అన్నారు. ఈ చిత్రానికి ఎం.ఎన్‌.బాల్‌రెడ్డి డీఓపీగా వ్యవహరించగా, సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.

More Telugu News