Chiranjeevi: రంజాన్ సందర్భంగా చిరంజీవిని కలిసిన అలీ సోదరులు

  • కమెడియన్ అలీ ఇంట పండుగ
  • కుటుంబ సభ్యులతో కలిసి చిరంజవి వద్దకు వెళ్లిన అలీ, ఖయ్యూం
  • రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
Ali and his brother Khayyum met Chiranjeevi on Ramadan day

ఇవాళ ముస్లింలకు పరమ పవిత్రమైన రంజాన్ పర్వదినం. ఈ సందర్భంగా టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ, ఆయన సోదరుడు ఖయ్యూం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆయన వారిని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 

అలీ రాకపై చిరంజీవి స్పందించారు. ఈ రంజాన్ పండుగను ఆలీ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.  

ఈ భేటీపై ఆలీ మాట్లాడుతూ, తమకు ఎంతో ముఖ్యమైన పండుగ రంజాన్ అని, ఈ పర్వదినాన్ని చిరంజీవితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కాగా, చిరంజీవి తన కొత్త చిత్రం షూటింగ్ లో ఉండగా... అలీ, ఖయ్యూం ఆయనను కారవాన్ లో కలిసినట్టు తెలుస్తోంది.

More Telugu News