Apsar: భారీ ప్రాజెక్టులు చేయనున్నట్టు చెప్పిన 'గంధర్వ' డైరెక్టర్!

  • క్రితం ఏడాదిలో వచ్చిన 'గంధర్వ'
  • విభిన్నమైన కంటెంట్ గా పేరు 
  • దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన అప్సర్ 
  • మరో రెండు పెద్ద ప్రాజెక్టులకు సన్నాహాలు   
Apsar Special

క్రితం ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైవిధ్యభరితమైన సినిమాలలో 'గంధర్వ' ఒకటిగా కనిపిస్తుంది. సందీప్ మాధవ్ - గాయత్రి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమాలో, యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కూడా తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఈ సినిమా దర్శకుడిగా అప్సర్ కి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తాను తయారు చేసుకున్న కథ పెద్ద బ్యానర్లో సినిమాగా రూపొందనుందనీ, ఈ నెలాఖరులో ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి రెడీ అవుతున్నామని అప్సర్ అన్నారు.  

ఈ సినిమా తరువాత మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టేసినట్టుగా ఆయన చెప్పారు. ఈ సినిమా కూడా బడా బ్యానర్లోనే నిర్మితం కానుందని అన్నారు. ఒక డిఫరెంట్ పాయింట్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఉంటుందని స్పష్టం చేశారు. 

More Telugu News