Amit Shah: ఎల్లుండి హైదరాబాద్ పర్యటనకు వస్తున్న అమిత్ షా.. 'ఆర్ఆర్ఆర్' టీమ్ కు తేనీటి విందు   

  • ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా
  • సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు 'ఆర్ఆర్ఆర్' టీమ్ తో తేనీటి విందు
  • అనంతరం చేవెళ్ల సభకు వెళ్లనున్న కేంద్ర హోంమంత్రి
Amit Shah to hold tea party to RRR team in Hyderabad

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ కూడా ఖరారయింది. ఆదివారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.30 గంటలకు విమానాశ్రయం సమీపంలోని నొవోటెల్ కు వెళ్తారు. ఆస్కార్ అవార్డు సాధించిన 'ఆర్ఆర్ఆర్' టీమ్ తో 4 గంటల నుంచి 4.30 వరకు తేనీటి విందులో పాల్గొంటారు. 4.30 నుంచి 5.10 గంటల వరకు బీజేపీ కోర్ కమిటీతో సమావేశమవుతారు. అనంతరం 5.15 గంలకు చేవెళ్ల సభకు బయల్దేరుతారు. చేవెళ్ల సభలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు పాల్గొంటారు. రాత్రి 7.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

More Telugu News