Tirumala: తిరుమల శ్రీవారికి రూ.1 కోటి విరాళం ఇచ్చిన హైదరాబాద్ భక్తులు

  • ఎస్సార్సీ ఇన్ ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ తరఫున విరాళం
  • వైవీ సుబ్బారెడ్డికి డిమాండ్ డ్రాఫ్ట్ అందజేసిన ఏవీకే ప్రసాద్, ఆంజనేయ ప్రసాద్
  • కృతజ్ఞతలు తెలిపిన వైవీ సుబ్బారెడ్డి
Hyderabadi firm donates one crore rupees Tirumala trust

తిరుమల కొండపై కొలువున్న శ్రీ వేంకటేశ్వరస్వామికి హైదరాబాద్ కు చెందిన భక్తులు భారీ విరాళం అందించారు. ఎస్సార్సీ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఏవీకే ప్రసాద్, ఏవీ ఆంజనేయ ప్రసాద్ కోటి రూపాయల డీడీని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. 

తాము అందించిన విరాళాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు కార్యకలాపాలకు వినియోగించాల్సిందిగా ఆ భక్తులు వైవీ సుబ్బారెడ్డిని కోరారు. దీనిపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేస్తున్నందుకు ఆ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News