DK Shivakumar: బీజేపీ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా సాగనంపితే అంత మంచిది: డీకే శివకుమార్

  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న డీకే శివకుమార్
  • బీజేపీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని డిమాండ్
DK Shivakumar demands to dismiss BJP government

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 10న కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ... ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎంత తొందరగా ఇక్కడున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపితే ఈ రాష్ట్రానికి, దేశానికి మంచిదని తెలిపారు. 

అవినీతి నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే ఎన్నికలుగా ఈ ఎన్నికలను శివకుమార్ అభివర్ణించారు. దేశంలో అవినీతి పతాక స్థాయికి చేరిందని... అవినీతిని ప్రధాని మోదీనే ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. అవినీతికి పాల్పడుతున్న సొంత పార్టీ నేతలపై మోదీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తే దేశానికి, రాష్ట్రానికి అంత మంచిదని అన్నారు.

More Telugu News