Congress: మరికాసేపట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • 11.30 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ
  • రాష్ట్రంలో మొత్తం 224 స్థానాలు
  • అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్న ‘ఆప్’
  • 124 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
EC to announce Karnataka assembly poll dates today

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఎన్నికల కమిషన్ మరికాసేపట్లో అంటే ఈ ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లోని ప్లీనరీ హాల్‌లో కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఈ నెల 25న 124 మంది అభ్యర్థులను ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ నుంచి బరిలోకి దిగుతుండగా, ఆ పార్టీ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 

కర్ణాటక ఎన్నికల బరిలోకి దిగుతున్న కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 80 మంది అభ్యర్థుల పేర్లను ఈ నెల 20న ప్రకటించింది. మొత్తం 224 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెడుతున్నట్టు పేర్కొంది. కర్ణాటకలోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో ముంబై-కర్ణాటక, దక్షిణ కర్ణాటక ప్రాంతాలు అతిపెద్దవి. ఇక్కడ వరుసగా 50, 51 అసెంబ్లీ స్థానాలున్నాయి.

More Telugu News