ఈ కాయగూరలతో పిల్లల్లో కాల్షియం లోపానికి చెక్
- కాల్షియం లోపం వల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం
- నీరసంతో పాటు రోగ నిరోధకత కూడా తగ్గుతుందట
- రోజువారీ ఆహారంలో సోయాబీన్, పెరుగు చేర్చాలంటున్న నిపుణులు
పిల్లల ఆహారంలో వీటిని చేర్చండి..
- కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలలో సోయాబీన్స్ ఒకటి.. ప్రతీ 100 గ్రాముల సోయాబీన్స్ లో దాదాపు 250 ఎంజీ పైనే కాల్షియం అందుతుంది.
- పాలకూరలో పోషకాలు ఎక్కువ. కాల్షియం లోపాన్ని నివారించడంతో పాటు విటమిన్ సి, కే, ఫోలిక్ యాసిడ్, ఐరన్ తదితర పోషకాలు ఉంటాయి
- పిల్లల ఎదుగుదలకు తోడ్పడే మరో వెజిటబుల్ బ్రొకోలి. విటమిన్ సి, కే లతో పాటు పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది
- రోజుకో స్పూన్ పెరుగు తినిపించడం ద్వారా పిల్లలకు అవసరమైన పోషకాలను అందించవచ్చు. పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుందని, పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు
- రాత్రిపూట నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే పిల్లలకు తినిపించడం ఆరోగ్యకరమని నిపుణుల సూచన. రోజుకో గుప్పెడు బాదాం పప్పుతో పిల్లల ఎముకలు దృఢంగా తయారవడంతో పాటు మానసికంగా కూడా పిల్లలు బలంగా తయారవుతారు
- ఇంట్లో తయారుచేసిన చీజ్ ను పిల్లల ఆహారంలో చేర్చడం వల్ల వారిలో కాల్షియం లోపం రాకుండా చూసుకోవచ్చు
- కాల్షియంతో పాటు పైబర్ ఎక్కువగా ఉండే కాయధాన్యాలను పిల్లలకు రోజూ తినిపించాలి. దీనివల్ల పిల్లల రోగనిరోధకత పెరుగుతుంది