Subrahmanyam Jaishankar: బీబీసీ డాక్యుమెంటరీ యాదృచ్ఛికంగా చేసింది కాదు: కేంద్రమంత్రి జై శంకర్

  • మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదాస్పదం
  • భగ్గుమన్న బీజేపీ వర్గాలు
  • కొన్నిసార్లు విదేశాల నుంచి కూడా రాజకీయాలు జరుగుతుంటాయని వ్యాఖ్యానించిన జైశంకర్ 
Union foreign minister Jai Shankar responds to BBC Documentary

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ప్రసారం చేసిన 'ఇండియా: ద మోదీ క్వశ్చన్' డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదం కావడం తెలిసిందే. దీనిపై బీజేపీ వర్గాలు బీబీసీపై భగ్గుమన్నాయి. తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఈ వివాదంపై స్పందించారు. 

బీబీసీ డాక్యుమెంటరీ యాదృచ్ఛికంగా చేసింది కాదని స్పష్టం చేశారు. ఆ డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రసారం కావడం పలు సందేహాలకు తావిస్తోందని అన్నారు. రాజకీయ ప్రోద్బలంతోనే బీబీసీ డాక్యుమెంటరీ తయారైందని వెల్లడించారు. రాజకీయాలు కొన్నిసార్లు విదేశాల నుంచి కూడా జరుగుతుంటాయని అన్నారు. ఎక్కడో యూరప్ నగరంలో ఎవరిపైనో ఈ డాక్యుమెంటరీ చేసి ఉంటే పట్టించుకుని ఉండేవారం కాదని పేర్కొన్నారు. 

భారత్ లో ఎన్నికల సీజన్ మొదలైందో లేదో తనకు తెలియదని... కానీ లండన్, న్యూయార్క్ లో మాత్రం ఎన్నికల సీజన్ మొదలైందని జై శంకర్ వ్యాఖ్యానించారు.

More Telugu News