కియారాకు సారీ చెప్పిన రామ్ చరణ్ భార్య ఉపాసన.. ఎందుకంటే!
- నిన్న జైసల్మేర్ లో ఘనంగా కియారా, సిద్దార్థ్ మల్హోత్రా వివాహం
- కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులకే ఆహ్వానం
- ఆహ్వానం అందినా వెళ్లలేకపోయిన చరణ్, ఉపాసన దంపతులు
కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా తమ వివాహ ఆల్బమ్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టుకు ఉపాసన కామెంట్ రాశారు. ‘అభినందనలు. మీ జంట చాలా అందంగా ఉంది. మేము హాజరుకానందుకు క్షమించండి. మీ ఇద్దరికీ ఎల్లప్పుడూ మా ప్రేమ ఉంటుంది’ అని పేర్కొన్నారు. కాగా, రామ్ చరణ్ ‘ఇది స్వర్గంలో జరిగిన మ్యాచ్’ అని కామెంట్ చేశారు.