Singer Sunitha: బాలూగారు పోయిన తరువాత కన్నీళ్లు రావడం లేదు: సింగర్ సునీత

  • బాలూ మరణానికి మించిన సంఘటన మరొకటి లేదన్న సునీత  
  • అంతగా ఇక ఏ విషయాలకి చలించడం లేదని వెల్లడి 
  • లైఫ్ పట్ల పూర్తి క్లారిటీతోనే ముందుకు వెళుతున్నానని వివరణ  
Singer Sunitha Interview

సింగర్ సునీత స్వరానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. జీవితంలో కెరియర్ పరంగాను .. వ్యక్తిగతంగాను అనేక సమస్యలను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లిన ఆమె, కొత్త జీవితాన్ని కూడా మొదలెట్టారు. తాజా ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ఆమె ప్రస్తావించారు. 

"నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలూగారిని పోగొట్టుకున్నాను. ఆ సంఘటన తరువాత నాకు కన్నీళ్లు రావడం ఆగిపోయాయి. అంతకు మించి చలించే సంఘటనలు ఇంకా ఏముంటాయి? అనిపించింది. అంతగా నన్ను ఇక ఏ సంఘటనలు కదిలించడం లేదు. ఆయన జ్ఞాపకాలతో .. ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకి మనమిచ్చే గౌరవం" అని అన్నారు. 

ఇక నా విషయానికొస్తే .. "జీవితంలో నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి .. బాధ్యతలు ఉన్నాయి. నన్ను ద్వేషించేవారినీ .. విమర్శించేవారిని పట్టించుకోకుండా, నా ముందున్న లక్ష్యాన్ని చేరుకోవడానికే ప్రయత్నిస్తూ వెళ్లాను. నేను ఏం చేయగలనో నాకు తెలుసు .. ఏం చేయాలో తెలుసు. ఆ క్లారిటీతోనే అడుగులు వేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News