Chiranjeevi: నిర్మాతల డబ్బును వేస్ట్ చేయొద్దు: చిరంజీవి

  • వాల్తేరు వీరయ్య కోసం బాధ్యతతో పని చేశానన్న చిరంజీవి
  • ఈ విజయం సినీ కార్మికులదని వ్యాఖ్య
  • ప్రేక్షకులు చెప్పేది విందామన్న మెగాస్టార్
dont waste producers money says Chiranjeevi

'వాల్తేరు వీరయ్య' ఘన విజయం సాధించడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయంపై స్పందించడానికి తనకు మాటలు కూడా రాలేదని చెప్పారు. మనం మాట్లాడటం ఆపేపి, ప్రేక్షకులు చెప్పేదే విందామని అన్నారు. ప్రేక్షకుల ఉత్సహమే మనల్ని నడిపించే ఇంధనమని చెప్పారు. ఈ సినిమా కోసం తాను బాధ్యతతో పని చేశానని అన్నారు. 

కష్టం తనది, రవితేజది కాదని... సినిమా బాగా రావాలని పని చేసిన వారిదని చెప్పారు. ఈ విజయం సినీ కార్మికులదని అన్నారు. ఈ సినిమా విజయం ఔత్సాహిక దర్శకులకు ఒక కేస్ స్టడీలా ఉపయోగపడుతుందని చెప్పారు. నిర్మాతల డబ్బును వేస్ట్ చేయవద్దని సూచించారు. ఈరోజు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News