Chiranjeevi: నువ్వు శ్రీదేవైతే నేనే చిరంజీవంటా ..'వాల్తేరు వీరయ్య' నుంచి లిరికల్ సాంగ్!

  • 'వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి 
  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో సాగే కథ 
  • చిరంజీవి సరసన శ్రుతి హాసన్ సందడి
  • బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది  
  • జనవరి 13వ తేదీన విడుదల  
Waltair Veerayya movie lyrical song released

చిరంజీవి హీరోగా 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి బాబీ దర్శకత్వం వహించాడు. మైత్రీ వారు నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. వైజాగ్ నేపథ్యంలో .. జాలరుల జీవితాలతో ముడిపడి సాగే కథ ఇది.  

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'నువ్వు శ్రీదేవైతే నేనే చిరంజీవంటా' అనే ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. "నువ్వు సీతవైతే నేను రాముడినంటా .. నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంటా' అంటూ ఈ పాట మొదలవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచడమే కాకుండా ఆయనే సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, జస్ప్రీత్ - సమీరా భరద్వాజ్ ఆలపించారు. 

మంచుకొండల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. చిరంజీవి మరింత హ్యాండ్సమ్ గా ... శ్రుతి హాసన్ మరింత గ్లామరస్ గా కనిపిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News