Sensex: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 51 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 0.55 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2 శాతం వరకు నష్టపోయిన ఏసియన్ పెయింట్స్
Markets ends in flat mode

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఆ తర్వాత చివర వరకు స్వల్ప లాభ, నష్టాల మధ్య కొనసాగుతూ చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51 పాయింట్లు కోల్పోయి 62,130కి పడిపోయింది. నిఫ్టీ 0.55 పాయింట్లు లాభపడి 18,497 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (1.18%), నెస్లే ఇండియా (1.13%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ (1.02%), విప్రో (0.86%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.80%).

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-1.94%), ఇన్ఫోసిస్ (-1.39%), టైటాన్ (-1.16%), కోటక్ బ్యాంక్ (-1.05%), భారతి ఎయిర్ టెల్ (-0.86%).

More Telugu News