ఇటలీ ప్రధానికి 'డబుల్ ఇకాత్ దుపట్టా' బహూకరించిన మోదీ
- ఇండోనేషియాలో జీ20 శిఖరాగ్ర సమావేశాలు
- వరుస సమావేశాలతో మోదీ బిజీ
- ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో సమావేశం
- మోదీ నుంచి స్కార్ఫ్ అందుకుని మురిసిపోయిన మెలోనీ
ఈ దుపట్టాను ఉత్తర గుజరాత్ లోని పటాన్ ప్రాంతంలో నివసించే సాల్వీ కుటుంబం రూపొందించింది. 'డబుల్ ఇకాత్' పద్ధతిలో రూపుదిద్దుకున్న ఈ దుపట్టా వివిధ రంగులతో ఆకర్షణీయంగా ఉంది. ఈ దుపట్టా రెండు వైపులా ఒకేలా ఉంటుంది. ఏది ముందు భాగం, ఏది వెనుక భాగం అనేది తెలుసుకోలేనంత గొప్పగా తీర్చిదిద్దారు.
కాగా, ఈ సమావేశంలో ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా వివిధ రంగాలకు చెందిన అంశాలపై మోదీ, మెలోనీ చర్చించారు. వాణిజ్యం, శక్తి, రక్షణ, ఉగ్రవాదం తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.