Allu Sirish: బాలకృష్ణ చీఫ్ గెస్టుగా 'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంట్!

  • అల్లు శిరీష్ హీరోగా 'ఊర్వశివో రాక్షసివో'
  • కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ 
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ 
  • నవంబర్ 4వ తేదీన సినిమా విడుదల
Urvasivo Rakshasivo movie update

అల్లు శిరీష్ హీరోగా .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా 'ఊర్వశివో రాక్షసివో' సినిమా రూపొందింది. ధీరజ్ - విజయ్ నిర్మించిన ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 30వ తేదీన హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ ఈవెంటుకి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి గెస్టుగా బాలకృష రావడం చాలా అరుదనే సంగతి తెలిసిందే. 

ఇక అల్లు శిరీష్ కి ఇంతవరకూ సరైన సినిమా పడలేదనే చెప్పాలి. ఈ సినిమా మాత్రం తనకి తప్పకుండా బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఇక అనూ ఇమ్మాన్యుయేల్ కి పెద్ద సినిమాలు పడినా అవి హిట్ కాకపోవడం వలన వెనుకబడిపోయింది. ఆమె కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో ఆమని .. సునీల్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

More Telugu News