Team India: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న టీమిండియా

  • ఆసీస్ పై 2-1తో సిరీస్ కైవసం
  • టీమిండియాకు, ఇంగ్లండ్ కు మధ్య 7 పాయింట్ల అంతరం
  • త్వరలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్
  • గెలిస్తే టీమిండియా నెంబర్ స్థానం మరింత పదిలం
Team India cements top spot in ICC Men T20 Team Rankings

రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో నెగ్గిన టీమిండియా తన ఖాతాలో రేటింగ్ పాయింట్ల సంఖ్యను పెంచుకుంది. టాప్ లో ఉన్న టీమిండియాకు, రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కు మధ్య 7 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. గత ర్యాంకింగ్స్ సమయంలో ఆ తేడా 1 పాయింట్ గా ఉంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 268 రేటింగ్ పాయింట్లు ఉండగా, ఇంగ్లండ్ ఖాతాలో 261 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.

ఇక, ఈ తాజా ర్యాంకింగ్స్ జాబితాలో దక్షిణాఫ్రికా (258), పాకిస్థాన్ (258), న్యూజిలాండ్ (252), ఆస్ట్రేలియా (250), వెస్టిండీస్ (241), శ్రీలంక (237), బంగ్లాదేశ్ (224), ఆఫ్ఘనిస్థాన్ (219) టాప్-10లో నిలిచాయి. కాగా, వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబరు 28, అక్టోబరు 2, 4 తేదీల్లో టీ20లు జరగనున్నాయి. ఈ సిరీస్ ను కూడా టీమిండియా చేజిక్కించుకుంటే, ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా నెంబర్ వన్ స్థానం మరింత పదిలం అవుతుంది.

More Telugu News