Mahesh Babu: త్రివిక్రమ్ చేతికి 'హిరణ్య కశిప' ప్రాజెక్టు?

  • మహేశ్ మూవీ షూటింగులో త్రివిక్రమ్  
  • ఆ తరువాత ప్రాజెక్టు అల్లు అర్జున్ తో
  • లైన్లో ఉన్న రానా దగ్గుబాటి 
  • 'హిరణ్యకశిప' ప్రాజెక్టు చేతులు మారిందంటూ టాక్
  • త్వరలో రానున్న క్లారిటీ
Rana in  Trivikram Movie

టాలీవుడ్ దర్శకులలో చారిత్రక .. పౌరాణిక కథలను సమర్థవంతంగా తెరకెక్కించగల అతి తక్కువమందిలో గుణశేఖర్ ఒకరు. 'రుద్రమదేవి' వంటి చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాను రూపొందించిన గుణశేఖర్, ఆ తరువాత 'హిరణ్య కశిప' ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని రావాలనుకున్నాడు. నిర్మాణ సంస్థగా సురేశ్ ప్రొడక్షన్స్ .. హీరోగా రానా పేర్లు బలంగా వినిపించాయి.

ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయిందనే టాక్ వచ్చింది. ఆ తర్వాత ఎక్కడ తేడా వచ్చిందో తెలియదుగానీ, సురేశ్ ప్రొడక్షన్స్ వారు వేరే ప్రాజెక్టులతో ముందుకు వెళ్లారు. 'శాకుంతలం' సినిమాతో గుణశేఖర్ బిజీ అయ్యాడు. ఆ తరువాత 'హిరణ్య కశిప' సినిమా ఉండొచ్చని అనుకుంటే, అది త్రివిక్రమ్ చేతికి వెళ్లినట్టుగా ఒక టాక్ బలంగానే వినిపిస్తోంది.

త్రివిక్రమ్ కి పురాణ కథలపై మంచి అవగాహన ఉంది. అందువలన గుణశేఖర్ తో సెటిల్మెంట్ చేసుకుని, రానా ఈ ప్రాజెక్టును తీసుకుని వెళ్లి త్రివిక్రమ్ చేతిలో పెట్టడం జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం మహేశ్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమా బన్నీతో ఉండనుంది. ఈ రెండు సినిమాల తరువాత రానాతో 'హిరణ్య కశిప' ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయంపై గుణశేఖర్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

More Telugu News