Mahesh Babu: మరో నాలుగు రోజుల్లో సెట్స్ పైకి మహేశ్ బాబు!

  • మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు
  • ఈ నెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటూ టాక్
  • యాక్షన్ సీన్ తో మొదలుకానున్న ఫస్టు షెడ్యూల్  
  • కథానాయికగా పూజ హెగ్డే ఎంపిక
Mahesh Babu and Trivikram Movie Update

మహేశ్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్నాడు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 28వ సినిమా. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగును ఈ నెల 12వ తేదీ నుంచి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగు హైదరాబాదు .. అన్నపూర్ణ స్టూడియోలో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో యాక్షన్ సీన్ ను చిత్రీకరించనున్నారు. పక్కా మాస్ యాక్షన్ కంటెంట్ తో త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

త్రివిక్రమ్ - మహేశ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. అందువలన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. మరో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతున్నారు.

More Telugu News