Chiranjeevi: హైదరాబాదులో మొదలైన చిరూ 154వ సినిమా తాజా షెడ్యూల్!

  • వరుస ప్రాజెక్టులతో బిజీగా చిరూ 
  • తాజా షెడ్యూల్ ను మొదలెట్టిన బాబీ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్
Chiranjeevi and bobby movie update

చిరంజీవి చాలా తక్కువ గ్యాపులో మూడు ప్రాజెక్టులను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ఒకదాని తరువాత ఒకటిగా ఆయన ఆ ప్రాజెక్టులను పూర్తిచేస్తూ వస్తున్నారు. 'గాడ్ ఫాదర్' సినిమాను ముగింపు దశకి తీసుకొచ్చిన ఆయన, అంతే స్పీడ్ తో బాబీ సినిమాను కూడా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. కెరియర్ పరంగా చిరంజీవికి ఇది 154వ సినిమా.

ఆల్రెడీ ఈ సినిమా షూటింగు కొంతవరకూ జరిగింది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాదులో ప్లాన్ చేశారు. ఈ రోజు నుంచి ఈ షెడ్యూల్ మొదలైంది. అందుకు సంబంధించిన ఒక ఫొటో ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. చిరంజీవి .. శ్రుతి హాసన్ కాంబినేషన్ లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

More Telugu News