Nikhil: కర్నూల్ వేదికగా 'కార్తికేయ 2' సెలబ్రేషన్స్!

  • ఈ నెల 13వ తేదీన విడుదలైన 'కార్తికేయ 2'
  • తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా
  • నార్త్ నుంచి వచ్చిన అనూహ్యమైన రెస్పాన్స్ 
  • రేపు కర్నూల్లో జరగనున్న సెలబ్రేషన్స్
Karthikeya 2 movie update

నిఖిల్ హీరోగా రూపొందిన 'కార్తికేయ 2' సినిమా, ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోను ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఇక ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ద్వాపరయుగం .. ద్వారకా నగరం .. ఈ రెండింటికి సంబంధించిన ఒక రహస్యం అనే పాయింట్ థియేటర్స్ కి జనాలను రప్పించింది. హిందీలో తొలి రోజున 50 థియేటర్లలోనే విడుదలైన ఈ సినిమా, 3వ రోజు నాటికి 700 థియేటర్లకు వెళ్లింది. ఇక 'శ్రీకృష్ణ జన్మాష్టమి' రోజున ఈ సినిమా వసూళ్లు అనూహ్యంగా పెరిగిపోయాయి. 

అలా ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దాంతో అందుకు సంబంధించిన సెలబ్రేషన్స్ ను నిర్వహించడానికి టీమ్ రెడీ అవుతోంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుందని చెబుతూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. నిఖిల్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఇది నిలిచింది. .

More Telugu News