Mahesh Babu: త్రివిక్రమ్ తో మహేశ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

  • మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు 
  • వచ్చేనెలలో మొదలుకానున్న షూటింగ్ 
  • కథానాయికగా అలరించనున్న పూజ హెగ్డే  
  • వచ్చే ఏడాదిలో ఏప్రిల్ 28వ తేదీన విడుదల
Mahesh Babu and Trivikram Movie Update

మహేశ్ బాబు తన 28వ సినిమా షూటింగు కోసం రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో ఈ సినిమా నడుస్తుందని చెబుతున్నారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని సమాచారం.
 
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా ఒక వీడియోను విడుదల చేశారు. 'అతడు' .. 'ఖలేజా' తరువాత మహేశ్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇది. చాలా గ్యాప్ తరువాత ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ సినిమాలో ఒక కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. మరో కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ పేరు వినిపిస్తోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు ప్రాజెక్టు రాజమౌళితో ఉందనే సంగతి తెలిసిందే.

More Telugu News