Nikhil: ఈ ప్రయాణంలో ప్రకృతి పెట్టే పరీక్షలు తప్పవు: 'కార్తికేయ 2' ట్రైలర్ రిలీజ్

  • చందూ మొండేటి నుంచి 'కార్తికేయ 2'
  • నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ 
  • ఉత్కంఠను పెంచుతున్న  ట్రైలర్ 
  • ఈ నెల 13వ తేదీన సినిమా రిలీజ్  
Karthikeya 2 trailer released

నిఖిల్ తన కెరియర్లో ఫస్టు పాన్ ఇండియా సినిమాగా 'కార్తికేయ 2' చేశాడు. ద్వాపరయుగంతో .. ద్వారకా నగరంతో ముడిపడిన కథ ఇది. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రను పోషించాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో ఏదో రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తుండటం .. అందుకు కొందరు అడ్డుపడుతుండటం ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ కార్యాన్ని సాధించడానికి తనని శ్రీకృష్ణుడు ఎంచుకున్నాడని భావించిన హీరో అవాంతరాలను ఎదుర్కుంటూ ఉంటాడు. 

సముద్రతీరంలో .. మంచు పర్వతాలలో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ముఖ్యమైన పాత్రల్లో ఆదిత్య మీనన్ .. తులసి .. శ్రీనివాస రెడ్డి కనిపించనున్నారు. 

More Telugu News