‘పక్కా కమర్షియల్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
- ఆగస్టు 5 నుంచి ఆహాలో ప్రసారం
- గోపీచంద్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం
- మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రానికి మిశ్రమ స్పందన
బన్నివాసు నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’ ఈ చిత్ర హక్కులు కొనుగోలు చేసింది. ఆగస్టు 5 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో చూడని వాళ్లు ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇంట్లోనే చూడాలంటే ఇంకో ఐదు రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.