చంద్రబాబును మోహన్ బాబు కలిసిన కారణమిదేనట!
- చంద్రగిరి సమీపంలో మోహన్ బాబు విద్యా సంస్థ
- శ్రీ విద్యానికేతన్లో సాయిబాబా గుడిని కట్టాలని మోహన్ బాబు నిర్ణయం
- విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాలని చంద్రబాబుకు ఆహ్వానం
- చంద్రబాబు, మోహన్ బాబుల భేటీపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ
తిరుపతి సమీపంలో చంద్రగిరి పరిసరాల్లో చంద్రబాబు సొంతూరు అయిన నారావారిపల్లె సమీపంలోనే మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ పేరిట ఓ విద్యా సంస్థను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ విద్యా సంస్థ ప్రాంగణంలో కొత్తగా సాయిబాబా గుడిని నిర్మించాలని మోహన్ బాబు నిర్ణయించారట. ఈ ఆలయంలో సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాలని చంద్రబాబును ఆహ్వానించేందుకే మోహన్ బాబు వచ్చారని టీడీపీ వెల్లడించింది.