Chiranjeevi: చిరూ 154వ మూవీ సెట్స్ కి వెళ్లిన సుకుమార్!

  • షూటింగు దశలో చిరంజీవి 154వ సినిమా 
  • ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్న బాబీ 
  • షూటింగు స్పాట్ కి వెళ్లిన సుకుమార్ 
  • సినిమా విశేషాలు వివరించిన బాబీ
Sukumar went to Chiranjeevi 154th movie sets

చిరంజీవి తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన బాబీ సినిమాను పూర్తి చేయనున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. 

కెరియర్ పరంగా చిరంజీవికి ఇది 154వ సినిమా. చిరంజీవి  .. శ్రుతి హాసన్ .. రాజేంద్ర ప్రసాద్ .. వెన్నెల కిశోర్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలోనే సుకుమార్ అక్కడికి వెళ్లారు. చిరంజీవితో పాటు అందరితోనూ కలిసి కాసేపు ముచ్చటించాడు. 

ఈ సినిమాకి సంబంధించిన అవుట్ పుట్ ఏదో సుకుమార్ కి బాబీ చూపించాడు. ఆ దృశ్యమే ఇక్కడి ఫొటోలో కనిపిస్తోంది. ఇక సుకుమార్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన 'పుష్ప 2' సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మితమయ్యే ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

More Telugu News