యాదాద్రిలో అపశ్రుతి.... మంత్రి పువ్వాడపై తేనెటీగల దాడి
- యాదాద్రి ఆలయ పునఃప్రారంభం
- సీఎం కేసీఆర్ తో పాటు హాజరైన మంత్రి పువ్వాడ
- మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా తేనెటీగల దాడి
- అలాగే పూజ కొనసాగించిన పువ్వాడ
- చికిత్స కోసం హైదరాబాద్ పయనం
- తాను క్షేమంగానే ఉన్నానని ట్విట్టర్ లో వెల్లడి
అయితే తేనెటీగలు కుట్టినప్పటికీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసేంత వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. దీనిపై అజయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అనుకోని రీతిలో తేనెటీగలు దాడి చేశాయని తెలిపారు. వైద్యులు రెండ్రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారని వివరించారు. తాను క్షేమంగానే ఉన్నానని, కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.