కామన్వెల్త్ క్రీడల్లో మరోసారి క్రికెట్ కు చోటు
- ఈ ఏడాది ఇంగ్లండ్ లో కామన్వెల్త్ క్రీడలు
- మహిళల క్రికెట్ జట్లతో పోటీలు
- టీ20 ఫార్మాట్లో పోటీలు
- ఒకే గ్రూప్ లో దాయాదులు
- తొలిమ్యాచ్ లో ఆసీస్ తో టీమిండియా ఢీ
అయితే ఈ పర్యాయం కేవలం మహిళల జట్లే బరిలో దిగుతాయని ఐసీసీ పేర్కొంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో రెండు గ్రూప్ లు ఉన్నాయి. గ్రూప్-ఏలో టీమిండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లున్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లున్నాయి. జులై 29న జరిగే తొలి మ్యాచ్ లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.