అతి త‌క్కువ ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా

team india score
  • తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్
  • రెండో ఇన్సింగ్స్‌లో రాణించ‌లేక‌పోతోన్న టీమిండియా
  • ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు 29 ఓవ‌ర్ల‌కు 82/5
కాన్పూర్ లో టీమిండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌటైన విష‌యం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కొన‌సాగిస్తోన్న టీమిండియా త‌డ‌బ‌డుతోంది. 51 ప‌రుగుల వ‌ద్దే ఐదు వికెట్లు కోల్పోయింది.

మ‌యాంక్ అగ‌ర్వాల్ 17, శుభ‌మ‌న్ గిల్ 1, ఛ‌టేశ్వ‌ర్ పూజారా 22, అజింక్యా ర‌హానె 4, ర‌వీంద్ర జ‌డేజా 0 ప‌రుగుల‌కే ఔట‌య్యారు. ప్ర‌స్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్య‌ర్ 17, ర‌వి చంద్ర‌న్ అశ్విన్ 20 ప‌రుగుల‌తో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు 29 ఓవ‌ర్ల‌కు 82/5 గా ఉంది. తొలి ఇన్సింగ్స్ లో టీమిండియా 345 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే.
Go Back to Shorts
Team New Zealand
Team India
Cricket

More Telugu News