Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చిరు సినిమాకి తమన్నాకు 3 కోట్లు?
  • 'ఆదిపురుష్' పూర్తి చేసిన ప్రభాస్
  • అడివి శేష్ 'మేజర్' షూటింగ్ పూర్తి    
Thamanna charges a bomb for Chiranjeevis movie

*  చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'భోళా శంకర్' చిత్రంలో కథానాయికగా తమన్నాను ఖరారు చేసిన విషయం విదితమే. ఇందులో నటిస్తున్నందుకు గాను తమన్నాకు పారితోషికంగా రూ.3 కోట్లు ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి అమ్మడు అడ్వాన్స్ కూడా తీసుకుందట.
*  ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' పేరిట పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన తన షూటింగ్ పార్టును ప్రభాస్ తాజాగా పూర్తిచేశాడు. ఈ సందర్భంగా సెట్స్ లో యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి సందడి చేశారు. ఇందులో కృతి సనన్ కథానాయికగా నటిస్తోంది.
*  అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న 'మేజర్' చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇందులో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. హీరో మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఫిబ్రవరి 11న విడుదల చేస్తారు.

More Telugu News